కేంద్రం హోల్సేల్గా.. రాష్ట్రం విడతల వారీగా అమ్మే యత్నం: శ్రావణ్
ABN , First Publish Date - 2021-03-05T18:06:40+05:30 IST
గుంటూరు: బంద్కు పూర్తి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ వెల్లడించారు. బంద్కు వైసీపీ మద్దతు తెలపడం సోచనీయమన్నారు
గుంటూరు: బంద్కు పూర్తి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ వెల్లడించారు. బంద్కు వైసీపీ మద్దతు తెలపడం సోచనీయమన్నారు. బస్సులు ఆపడంతోనే మద్దతు తెలిపినట్టు కాదని.. వైసీపీ శ్రేణులు బంద్లో పాల్గొని నిరసన తెలపాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అని శ్రావణ్ కుమార్ తెలిపారు. కేంద్రం హోల్ సేల్గా అమ్మే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం విడతల వారీగా అమ్మే ప్రయత్నం చేస్తోందన్నారు.ప్రైవేటీకరణను నిలిపివేసేంత వరకూ టీడీపీ ఆందోళన చేస్తుందని శ్రావణ్ పేర్కొన్నారు.