ఈ నెల 30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2021-12-28T12:22:45+05:30 IST
పర్యాటకుల సౌకర్యార్థం ఈ నెల 30 నుంచి జనవరి 16 వరకు అరకులోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే సోమవారం ప్రకటించింది.
![ఈ నెల 30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విశాఖపట్నం: పర్యాటకుల సౌకర్యార్థం ఈ నెల 30 నుంచి జనవరి 16 వరకు అరకులోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే సోమవారం ప్రకటించింది. 08525 నంబరు గల రైలు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది. అటు నుంచి 08526 నంబరుతో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతుంది.