రూ.300 దర్శన టికెట్ల కోసం భక్తుల పాట్లు
ABN , First Publish Date - 2021-08-25T09:11:23+05:30 IST
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి

తిరుమల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి సంబంధించిన కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు రోజుకు 8వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు. భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు పోటీపడటంతో ఈసారీ టీటీడీ వెబ్సైట్ మొరాయించింది. కొందరికి వెబ్సైట్ ఓపెన్ కాలేదు. మరికొందరికి వివరాల నమోదు పూర్తయినా పేమెంట్ పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నవారు గంట వ్యవధిలోనే టికెట్ల కోటా మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.