పాత నేరస్ధులపై నిఘా పెంచుతాం: ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్
ABN , First Publish Date - 2021-10-29T20:21:12+05:30 IST
జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసులలో ఉన్నవారిని పిలిపించామని ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించామన్నారు.
కృష్ణాజిల్లా: జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసులలో ఉన్నవారిని పిలిపించామని ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించామన్నారు. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని తెలిపారు. రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. పదే పదే నేరాలకు పాల్పడేవారిని ప్రభుత్వ పథకాలు వారికి రాకుండా వారి లిస్టు ప్రభుత్వానికి ఇస్తామన్నారు. కౌన్సెలింగ్ కోసం మొదటిసారి ఇలా పెద్ద మొత్తంలో పిలిచామన్నారు. ఇప్పుడే కొందరిపై షీట్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. గంజాయిపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే నిజంగా మారారని గుర్తిస్తామో.. వారికి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో గంజాయి హబ్ ఉంటుందని తెలిసిందన్నారు. నిన్న, మొన్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 14 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు.