14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
ABN , First Publish Date - 2021-11-02T02:17:51+05:30 IST
తిరుపతి పుణ్యక్షేత్రంలో 29వ సౌత్ జోన్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
చిత్తూరు: తిరుపతి పుణ్యక్షేత్రంలో 29వ సౌత్ జోన్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల 14న తిరుపతి తాజ్ హోటల్లో జరిగే ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల సీఎంలు, ముఖ్య కార్యదర్శులు, అండమాన్ నికోబార్ లక్షదీవుల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్షా అదే రోజు మధ్యాహ్నం సమావేశానంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.