‘బాధ్యత మరిచి దోపిడీకి సహకరిస్తున్నారు’
ABN , First Publish Date - 2021-07-08T21:08:04+05:30 IST
‘బాధ్యత మరిచి దోపిడీకి సహకరిస్తున్నారు’

నెల్లూరు: మాఫియా డాన్ పూటకో కోటి లెక్కన రోజుకు రూ.3 కోట్లు దోచుకుంటుంటే అడ్డుకోవాల్సిన అధికారులు బాధ్యత మరిచి దోపిడీకి సహకరిస్తున్నారని సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రభగిరిపట్నం కొండ, కసుమూరు తిప్పతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలోని గుట్టలుమిట్టలన్నీ మాయమవుతుంటే అధికారులు కళ్లు మూసుకు కూర్చున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.