సింహాచలం ఆలయ గోశాలలో ‘పాలు’ పక్కదారి
ABN , First Publish Date - 2021-08-22T20:47:35+05:30 IST
సింహాచలం ఆలయ గోశాలలో గోవుల పాలు పక్కదారి పడుతున్నాయి. అభిషేకం, నైవేద్యానికి ఉపయోగించే పాలు అధికారుల ఇళ్లల్లోకి వెళ్తున్నాయి.
విశాఖ: సింహాచలం ఆలయ గోశాలలో గోవుల పాలు పక్కదారి పడుతున్నాయి. అభిషేకం, నైవేద్యానికి ఉపయోగించే పాలు అధికారుల ఇళ్లల్లోకి వెళ్తున్నాయి. దేవస్థానం ఈవో సూర్యకళ ఇంటికి 3 లీటర్ల గోశాల ఆవు పాలు తీసుకెళ్లారు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గోశాల నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన లేగదూడల్లో ఐదు దూడలు మృత్యువాత పడ్డాయి. సింహాచలం పాత గోశాలలో ఈ వాటిని దేవస్థానానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో గుట్టుగా ఖననం చేశారు. ప్రస్తుతం గోశాలలో సుమారు 400 లేగదూడలు ఉన్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ దూడలను ఉంచడంతో అవి తిరిగేందుకు తగిన స్థలం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో ఐదు దూడలు మృతిచెందాయి.