భారీగా వెండి పట్టివేత
ABN , First Publish Date - 2021-04-12T21:01:15+05:30 IST
అనుమతి పత్రాలు సరిగా లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని

కర్నూలు: అనుమతి పత్రాలు సరిగా లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పంచలింగాల చెక్పోస్టు దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 23 కిలోల వెండిని ఈ తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుకున్న వెండి విలువ దాదాపు 11 లక్షల రూపాయల విలువ ఉంటుందని భావిస్తున్నారు. వెండిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.