నేడు గవర్నర్‌ను కలవనున్న ఎస్ఈసీ..

ABN , First Publish Date - 2021-01-12T14:25:34+05:30 IST

అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్‌ను కలవనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు.

నేడు గవర్నర్‌ను కలవనున్న ఎస్ఈసీ..

అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్‌ను కలవనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు, డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌పై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారమే డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. మంగళవారం ఉదయం 10.30 కు విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ క్రమంలోనే నేడు గవర్నర్‌ను నిమ్మగడ్డ కలవనున్నారు.


Updated Date - 2021-01-12T14:25:34+05:30 IST