ఐటీ దిగ్బంధంలో సక్కు కార్పొరేట్‌ ఆఫీసు

ABN , First Publish Date - 2021-12-08T08:46:06+05:30 IST

ఐటీ దిగ్బంధంలో సక్కు కార్పొరేట్‌ ఆఫీసు

ఐటీ దిగ్బంధంలో సక్కు కార్పొరేట్‌ ఆఫీసు

75 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో సోదాలు

వ్యాపార వర్గాల్లో కలకలం.. సమాచార గోప్యత

గుంటూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని ప్రముఖ పౌల్ర్టీ సంస్థ.. సక్కు కార్పొరేట్‌ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం నుంచే ఐటీ బృందాలు దిగ్బంధించాయి. ఇక్కడి లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డుపై ఈ కార్యాలయం ఉండగా, స్థానిక పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను కాసేపు నియంత్రించాయి. అనంతరం సక్కు ఆఫీసు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు ప్రారంభించాయి. ఉద్యోగులు సహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 75 మంది ఐటీ అధికారులు/ఉద్యోగులు ఏకకాలంలో ఒక కార్పొరేట్‌ ఆఫీసులో సోదాలకు దిగడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. సంవత్సరాంతం కావడంతో టార్గెట్లను అధిగమించేందుకు ఈ సోదాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు. సోదాల్లో లభించిన సక్కు గ్రూపు ఆఫ్‌ కంపెనీ్‌సకి సంబంధించిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టా్‌పలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల సమయానికి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సక్కు గ్రూపునకు పౌలీ్ట్ర, పత్తి వ్యాపార సంస్థల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. సోదాల్లో ఏమేమి స్వాధీనం చేసుకొన్నామన్న విషయాన్ని ఐటీ అధికారులు గోప్యంగా ఉంచారు. 

Updated Date - 2021-12-08T08:46:06+05:30 IST