టీడీపీ కావాలనే రాద్దాంతం చేస్తోంది : రోజా
ABN , First Publish Date - 2021-12-13T20:05:09+05:30 IST
ఓటీఎస్పై కావాలనే టీడీపీ రాద్దాంతం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రజల్లో ఓటీఎస్పై కావాలనే టీడీపీ లేని పోనీ అపోహలు సృష్టిస్తోందన్నారు.
రాజమండ్రి : ఓటీఎస్పై కావాలనే టీడీపీ రాద్దాంతం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రజల్లో ఓటీఎస్పై కావాలనే టీడీపీ లేని పోనీ అపోహలు సృష్టిస్తోందన్నారు. పేదవాడికి ఉపయోగ పడే పథకం ఒక్కటి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకు రాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు సీఎం జగన్ టార్గెట్ అవుతున్నారని రోజా విమర్శించారు.