కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-04-21T12:47:04+05:30 IST
జిల్లాలోని బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి మీద నుంచి వేగంగా దూసుకువచ్చిన బైక్..అదుపు తప్పి
కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి మీద నుంచి వేగంగా దూసుకువచ్చిన బైక్..అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన బాపులపాడు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. యువకులు శ్రీకాకుళం నుంచి విజయవాడకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు: సత్యనారాయణ, కృష్ణగా పోలీసులు గుర్తించారు.