శ్రీశైలానికి 32,206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2021-08-25T09:22:00+05:30 IST

గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకుతోడు శబరి, ఇంద్రావతి, సీలేరు లాంటి ఉపనదులు, కొండవాగుల వరద జలాలు గోదావరిలో కలుస్తుండటంతో

శ్రీశైలానికి 32,206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం


పోలవరం, శ్రీశైలం, ఆగస్టు 24 : గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకుతోడు శబరి, ఇంద్రావతి, సీలేరు లాంటి ఉపనదులు, కొండవాగుల వరద జలాలు గోదావరిలో కలుస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి పోలవరం వద్ద 20.11 మీటర్లుగా ఉన్న నీటిమట్టం 21.10 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌ వే వద్ద 30 మీటర్లుగా నమోదైంది. అదనంగా వస్తున్న లక్షా 86 వేల 620 క్యూసెక్కుల వరద జలాలను గోదావరి సహజ ప్రవాహంలోకి స్పిల్‌ వే ద్వారా విడుదల చేసినట్లు పోలవరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆదిరెడ్డి తెలిపారు. ఇక, శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి 32,206 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీంఎసీలు కాగా, ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం 877.60 అడుగుల వద్ద 176.3314 టీఎంసీల నీరు చేరింది. తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి చేయడం లేదు.

Updated Date - 2021-08-25T09:22:00+05:30 IST