స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు సిద్ధం: రామ్మోహన్
ABN , First Publish Date - 2021-07-17T00:04:38+05:30 IST
స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు తాము సిద్ధమని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.
అమరావతి: స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు తాము సిద్ధమని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతరం రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడుతామని తెలిపారు. విశాఖ స్టీల్పై ముందుండి సీఎం జగన్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయని, అందుకే జల వివాదంపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని రామ్మోహన్నాయుడు ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర హాజరైనారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై చర్చించారని టీడీపీ నేతలు తెలిపారు.