ఏపీలో జూలు విదిల్చిన రెరా
ABN , First Publish Date - 2021-11-13T00:49:33+05:30 IST
ఏపీలో రెరా జూలు విదిల్చింది. తొలిసారిగా రెండు
విజయవాడ: ఏపీలో రెరా జూలు విదిల్చింది. తొలిసారిగా రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలపై కొరడా ఝులిపించింది. పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయని ఫ్యూచర్ ఆల్ హోమ్స్, రామకృష్ణ హౌసింగ్ pvt ltdలకు భారీగా జరిమానాలు విధించింది. తమకు జరిగిన అన్యాయంపై కే. మధు ప్రకాశ్, వీ. మురళి కృష్ణ అనే వ్యక్తులు రెరాకు ఫిర్యాదు చేసారు. బాధితులు కట్టిన డిపాజిట్స్ పై 9 శాతం పరిహారం చెల్లించాలని, మొత్తం నగదుకు 14.15 వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. రెండు ప్రముఖ సంస్థలపై రెరా చర్యలతో భవన నిర్మాణ సంస్థలు ఉలిక్కి పడ్డాయి.