ఆ సమయాల్లో సిఫారసు లేఖలు స్వీకరించం: టీటీడీ
ABN , First Publish Date - 2021-12-28T08:17:11+05:30 IST
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 1వ తేదీతో పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది.
![ఆ సమయాల్లో సిఫారసు లేఖలు స్వీకరించం: టీటీడీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 1వ తేదీతో పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ రోజుల్లో డోనర్స్కు కూడా గదుల ప్రివిలేజ్ ను టీటీడీ రద్దు చేసింది. ఆ పదిరోజుల పాటు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలను వడ్డించనున్నారు.