వర్షసూచన

ABN , First Publish Date - 2021-05-05T08:40:37+05:30 IST

విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తూర్పు, మధ్య భారతాల్లో మరో రెండు ఆవర్తనాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి

వర్షసూచన

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి): విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తూర్పు, మధ్య భారతాల్లో మరో రెండు ఆవర్తనాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితంపైకి మేఘాలు ఆవరించడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తరకోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కర్నూలులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదయ్యింది.

Updated Date - 2021-05-05T08:40:37+05:30 IST