ఏపీ కాంగ్రెస్పై దృష్టిసారించిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-08-10T23:32:38+05:30 IST
ఏపీ కాంగ్రెస్పై దృష్టిసారించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్పై రాహుల్ గాంధీ దృష్టిసారించారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, అస్సాం,కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. రేపు ఏపీకి సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేవీపీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజుతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీకానున్నారు. పార్టీలోని దళిత నేతలు హర్షకుమార్, చింతమోహన్, జేడీ శీలంతో ఇప్పటికే రాహుల్ చర్చించారు.