ఏపీ సీఎస్తో మాట్లాడిన రఘురామ లాయర్
ABN , First Publish Date - 2021-05-17T23:52:54+05:30 IST
ఏపీ చీఫ్ సెక్రటరీ ఆథిత్యనాథ్ తీరుపై ఎంపీ రఘురామ న్యాయవాదుల విస్మయం వ్యక్తం చేశారు. రఘురామను సికింద్రాబాద్
అమరావతి: ఏపీ చీఫ్ సెక్రటరీ ఆథిత్యనాథ్ తీరుపై ఎంపీ రఘురామ న్యాయవాదుల విస్మయం వ్యక్తం చేశారు. రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపే బాధ్యతను సుప్రీంకోర్టు సీఎస్పై పెట్టినా వేగంగా స్పందించలేదని లాయర్లు వాపోయారు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో రఘురామ లాయర్లు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము జ్యుడీషియల్ ఆఫీసర్ను నియమించామని కోర్టు అధికారులు రఘురామ లాయర్లకు చెప్పారు. త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇస్తామన్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ఏపీ సీఎస్తో కూడా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఇవాళ రాత్రిలోపు తరలిస్తామని సీఎస్ చెప్పారని, రఘురామ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా త్వరగా తరలించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సీఎస్ చెప్పారని లక్ష్మీనారాయణ తెలిపారు.