పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయించిన పుట్టా
ABN , First Publish Date - 2021-07-15T22:18:29+05:30 IST
మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల తీరుపై టీడీపీ నేత పుట్టా సుధాకర్యాదవ్ కోర్టును ఆశ్రయించారు. మైదుకూరు
కడప: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల తీరుపై టీడీపీ నేత పుట్టా సుధాకర్యాదవ్ కోర్టును ఆశ్రయించారు. మైదుకూరు 6వ వార్డు నుండి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధి మహబూబ్బీని తమ ఇంట్లో నుంచి పోలీసులే దౌర్జన్యంగా వాహనంలో ఎక్కించుకొని వైసీపీ శిబిరానికి తరలించారని తెలిపారు. తమ అభ్యర్ధిని తామే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తమపై అక్రమ కేసు బనాయించారని సుధాకర్యాదవ్ వాపోయారు.