మంత్రి ఆదిమూలపు సురేష్కు నిరసన సెగ
ABN , First Publish Date - 2021-11-09T22:28:43+05:30 IST
నగరంలోని ఆర్ అండ్ బీ భవనంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ ను
విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బీ భవనంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్మీట్ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అనంతపురంలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేసారు. విద్యార్థులపై దాడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి. విద్యార్థి సంఘాలకు వివరణ ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేసారు. ఎయిడెడ్ పాఠశాలల వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులకు నష్టం కల్గిస్తున్నారన్నారు. దీంతో భద్రత మధ్య మంత్రిని పోలీసులు తీసుకెళ్లారు.