బెజవాడలో పోలీసుల అత్యుత్సాహం
ABN , First Publish Date - 2021-10-20T18:15:14+05:30 IST
బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిటీ టెర్మినల్ బస్ స్టాండ్ వద్ద టీఎన్టీయూసీ నేతలు రఘురామరాజు, పరుచూరి ప్రసాద్ ఆందోళన చేయగా
విజయవాడ: బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిటీ టెర్మినల్ బస్ స్టాండ్ వద్ద టీఎన్టీయూసీ నేతలు రఘురామరాజు, పరుచూరి ప్రసాద్ ఆందోళన చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా టీఎన్టీయూసీ నాయకులు పరుచూరి ప్రసాద్కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. నడవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.