సీఎంఆర్ఎఫ్ కేసులో ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ
ABN , First Publish Date - 2021-10-03T23:00:01+05:30 IST
సీఎంఆర్ఎఫ్ కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది.
అమరావతి: సీఎంఆర్ఎఫ్ కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ కస్టడీలో ఆశించిన స్థాయిలో సమాచారం లభించలేదని చెబుతున్నారు. సెక్షన్లో సిబ్బంది అందరికీ సిస్టం యాక్సెస్ ఉండటంతో నకిలీ బిల్లులపై ఆధారాలు లభించలేదు. చెల్లింపులు నిర్ధారించే యూజర్ ఐడీల గోప్యతలో లోపం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సాంకేతిక సాక్ష్యాల కోసం ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది.