డ్రగ్స్పై ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది: పయ్యావుల కేశవ్
ABN , First Publish Date - 2021-10-21T17:14:00+05:30 IST
గంజాయిపై పక్క రాష్ట్ర సీఎం స్పందించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మన సీఎం ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారన్నారు.
అమరావతి: గంజాయిపై పక్క రాష్ట్ర సీఎం స్పందించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మన సీఎం ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారన్నారు. డీజీపీ పర్యవేక్షణలోనే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. తమపై దాడులు చేసి.. మాపైనే కేసులు పెడుతున్నారన్నారు. అధికారం చేతిలో ఉందని విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. దాడులపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘటనలో డీజీపీ పాత్ర ఉందో.. లేదో తేల్చాలని పయ్యావుల పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖను దిగజారుస్తున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు.