ధాన్యం బకాయిలు చెల్లించండి: ఉమా
ABN , First Publish Date - 2021-07-26T08:20:51+05:30 IST
రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు రూ.4 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కవులూరు (జి.కొండూరు), జూలై 25: రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు రూ.4 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కవులూరు గ్రామంలో ఆదివారం ఆయన ధాన్యం బకాయిల కోసం రైతులతో కలిసి నిరసన చేపట్టారు. గోదావరికి వరద వస్తుంటే అక్కడి నిర్వాసితులు కొండల మీద, గుట్టల మీద బతుకుతున్నారన్నారు.