PAWAN KALYAN : జనసేనాని వద్దకు సినీ నిర్మాతల బృందం
ABN , First Publish Date - 2021-10-01T23:15:06+05:30 IST
ఈ మధ్యే ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసిన టాలీవుడ్ సినీ నిర్మాతలు తాజాగా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవర్ స్టార్ ఘాటు వ్యాఖ్యలతో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి, పవన్కి మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వమే సినిమా టికెట్లను అమ్మాలని భావించటంపై జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా స్సందించారు.
అమరావతి: ఈ మధ్యే ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసిన టాలీవుడ్ సినీ నిర్మాతలు తాజాగా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవర్ స్టార్ ఘాటు వ్యాఖ్యలతో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి, పవన్కి మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వమే సినిమా టికెట్లను అమ్మాలని భావించటంపై జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా స్సందించారు. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మాటలు కూడా మధ్యలో మరింత వేడిని రాజేశాయి. అయితే, ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు, వంశీరెడ్డి తదితరులు పవన్ను కలవటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పవన్తో నిర్మాతల మంతనాలు ఏయే అంశాలపై సాగాయన్నది ఇంకా తెలియటం లేదు. కాకపోతే, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన సందర్భంగా మాత్రం వారు చిత్ర పరిశ్రమని వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని తామే కోరినట్టుగా నిర్మాతలు తెలిపారు.