వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది: పవన్

ABN , First Publish Date - 2021-10-29T19:45:58+05:30 IST

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది: పవన్

అమరావతి : ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు ట్విటర్ వేదికగా పవన్ గంజాయి సమస్యపై స్పందించారు. ‘‘ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదు, ఇది 15-20 ఏళ్లుగా ఉంది. నేను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది. YCP ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలి. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలి. సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలి’’ అంటూ 2018లో తాను గంజాయి గురించి మాట్లాడిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.

Updated Date - 2021-10-29T19:45:58+05:30 IST