మురళీధరన్పై దాడి దురదృష్టకరం: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2021-05-07T10:13:00+05:30 IST
‘‘కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ వీ మురళీధరన్పై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాడి జరిగిందనే వార్త బాధ కలిగించింది
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ వీ మురళీధరన్పై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాడి జరిగిందనే వార్త బాధ కలిగించింది. ఇది చాలా దురదృష్టకరం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండించాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.