పైడితల్లి అమ్మవారి తలయారి మృతి
ABN , First Publish Date - 2021-01-22T15:18:40+05:30 IST
జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి చెందారు.
విజయనగరం: జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి చెందారు. పూర్వ కాలం నుంచి సిరిమానోత్సవాలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భక్తులందరికీ పైడిరాజు సుపరిచితులే. అమ్మవారికి ప్రతిరోజు నిష్ఠగా పూజలు చేసేవారు. పూజారి మృతితో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతోన్నారు.