కోదండరామస్వామి కల్యాణానికి సీఎం జగన్ హాజరు
ABN , First Publish Date - 2021-04-10T02:00:09+05:30 IST
జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈ సారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో
కడప: జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈ సారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5 వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం జగన్ దంపతులు హాజరవుతారని ఆయన తెలిపారు. స్వామివారికి సీఎం జగన్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో జవహర్రెడ్డి పేర్కొన్నారు.