తెలంగాణతో సమానంగా ఆయిల్పామ్ ధరలు
ABN , First Publish Date - 2021-11-28T08:10:11+05:30 IST
తెలంగాణతో సమానంగా ఆయిల్పామ్ ధరలు

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్పామ్ రైతులకు తెలంగాణాతో సమానంగా ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి కన్నబాబు హామీ ఇచ్చినట్లు ఏపీ ఆయిల్పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు బీవీ రాఘవరావు తెలిపారు. 2022-23 (నవంబరు నుంచి అక్టోబరు వరకు) సంవత్సరానికి ఆయిల్పామ్ తాజా పండ్లలో ముడి చమురు శాతాన్ని (ఓఈఆర్) తెలంగాణతో సమానంగా నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కలిసి కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.