జూ. ఎన్టీఆర్‌ను ప్రచారానికి తేవాలి.. చంద్రబాబును కోరిన కార్యకర్తలు

ABN , First Publish Date - 2021-02-27T01:27:53+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో నటుడు ఎన్టీఆర్ టీడీపీ

జూ. ఎన్టీఆర్‌ను ప్రచారానికి తేవాలి.. చంద్రబాబును కోరిన కార్యకర్తలు

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో టీడీపీ తరపున నటుడు ఎన్టీఆర్ ప్రచారం చేయాలని కార్యకర్తలు చంద్రబాబును కోరారు. అభిమానుల కోరికకు చంద్రబాబు మౌనంగా తలూపారు.  2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం చేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ వాహనానికి ప్రమాదం జరిగింది. అటు తర్వాత ఆయన ప్రచారం చేయలేదు.


ఆ తర్వాత 2014లో ఉమ్మడి ఏపీని విభజించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి హరికృష్ణ కుమారై సుహాసినిని నిలబెట్టారు. అప్పుడు అక్క సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-02-27T01:27:53+05:30 IST