ఎస్పీ అన్బురాజన్కు నోటీసులు జారీ
ABN , First Publish Date - 2021-09-04T01:47:20+05:30 IST
ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకేసుపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది.

కడప: ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకేసుపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. ఎస్పీ అన్బురాజన్కు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేరుగా బీసీ జాతీయ కమిషన్ ఎదుట హాజరుకావాలని ఎస్పీకి ఆదేశాలిచ్చింది. నందం సుబ్బయ్య భార్య అపరాజిత ఇటీవలే బీసీ జాతీయ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు.