ఏపీలో దేవాలయాలపై ఆగని దాడులు... తాజాగా..
ABN , First Publish Date - 2021-02-28T00:31:12+05:30 IST
ఏపీలో దేవాలయాలపై ఆగని దాడులు... తాజాగా..
కర్నూలు: ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా డోన్ మండలం వెంకటనాయనిపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది. కొత్తగా నిర్మించిన దేవాలయం మూల స్తంభాలను ధ్వంసం చేశారు. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా ఉపాధ్యాక్షుడు వడ్డే మహారాజు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.