పెట్రో ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మె
ABN , First Publish Date - 2021-02-26T08:59:14+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సింటా, ఆలిండియా ట్రాన్స్పోర్టుల పిలుపుమేరకు శుక్రవారం నాటి ఒకరోజు బంద్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది...

- ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్.. నేటి బంద్కు మద్దతు
విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సింటా, ఆలిండియా ట్రాన్స్పోర్టుల పిలుపుమేరకు శుక్రవారం నాటి ఒకరోజు బంద్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది. పెట్రో ధరలు తగ్గించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు లారీలను బయటకు తీయవద్దని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం పిలుపునిచ్చారు. కేంద్రం ఇప్పటికే రోడ్డు సెస్ ద్వారా రూ.12 వసూలు చేస్తున్నందున, కొవిడ్ అనంతరం రవాణారంగం సంక్షోభంలో పడిన నేపథ్యంలో టోల్ ప్లాజాలను ఎత్తివేయాలన్నారు.