గుంటూరు జిల్లా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
ABN , First Publish Date - 2021-01-25T18:56:05+05:30 IST
గుంటూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
గుంటూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడులో టీడీపీ అభ్యర్థులు తొలి నామినేషన్లు వేశారు. పంచాయతీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. అయితే గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగింది.