హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షలు
ABN , First Publish Date - 2021-04-19T10:01:45+05:30 IST
మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్-1 సారథి అయిన 40 ఏళ్ల హిడ్మాను
రివార్డును ప్రకటించిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్-1 సారథి అయిన 40 ఏళ్ల హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది.ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 22 మంది మృతిచెందారు.
ఈ దాడికి వ్యూహ రచన చేసింది హిడ్మానేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు హిడ్మాపై ఎన్ఐఏ ఇప్పటికే చార్జిషీట్ను దాఖలు చేసింది. ఇటీవల ఎన్ఐఏ బృందం ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్ సంభవించిన ప్రాంతంలో పర్యటించిన తర్వాత హిడ్మాపై రివార్డును ప్రకటించారు.