ఏపీలో కొత్తగా 1,217 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-08-22T02:14:19+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల
![ఏపీలో కొత్తగా 1,217 కరోనా పాజిటివ్ కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082108322672/08212021204339n91.jpg)
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1,217 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 13 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 20,01,215గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 13,715 మంది మరణించారు.