ఏపీలో కొత్తగా 320 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-11-08T01:47:09+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 320 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,68,241 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన మరణాలతో కలిపి రాష్టవ్యాప్తంగా 14,397 మరణాలు సంభవించాయి. ఏపీలో 3,458 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 20,50,386 మంది రికవరీ అయ్యారు.

Updated Date - 2021-11-08T01:47:09+05:30 IST