వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ: ఎమ్మెల్యే కాకాని

ABN , First Publish Date - 2021-05-21T20:42:08+05:30 IST

ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని ఎమ్మెల్యే కాకాని వెల్లడించారు.

వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ: ఎమ్మెల్యే కాకాని

నెల్లూరు జిల్లా: ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. 


ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-21T20:42:08+05:30 IST