Nellore: మహిళపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-08-27T13:01:37+05:30 IST

రిజన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. మండలంలోని ఓ గిరిజనకాలనీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల కిత్రం ఆ గిరిజన

Nellore: మహిళపై అత్యాచారయత్నం

నెల్లూరు: గిరిజన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. మండలంలోని ఓ గిరిజనకాలనీలో ఈ ఘటన జరిగింది.  బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల కిత్రం ఆ గిరిజన మహిళ భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఆ గ్రామానికి చెందిన బండ్ల మస్తాన్‌ ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను అమాంతం ఎత్తుకుని బయటకు వచ్చాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టింది. దాంతో అతను ఆమెను కింద పడేసి పారిపోయాడు. ఆమె బండ మీద పడడంతో కాలుకు స్వల్ప గాయమైంది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అత్యాచారయత్న ఘటనను రాజీ చేసేందుకు కొందరు పెద్దలు బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆ కామాంధుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-27T13:01:37+05:30 IST