జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-11-26T16:01:01+05:30 IST
సీఎం జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

అమరావతి: సీఎం జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్ వేశారన్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దని... తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు.