జాంబిరెడ్డిలా జగన్రెడ్డి
ABN , First Publish Date - 2021-04-16T10:09:31+05:30 IST
‘‘ముఖ్యమంత్రి జగన్రెడ్డి జాంబిరెడ్డిలా వ్యవహరిస్తున్నారు. ఒకరిని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతారు. ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన జగన్రెడ్డి ఇప్పటివరకు
హోదాకై వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే తెలుగుదేశం ఎంపీలూ సిద్ధం: లోకేశ్
అనపర్తి, మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 15: ‘‘ముఖ్యమంత్రి జగన్రెడ్డి జాంబిరెడ్డిలా వ్యవహరిస్తున్నారు. ఒకరిని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతారు. ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన జగన్రెడ్డి ఇప్పటివరకు 25 మంది టీడీపీకి కార్యకర్తలను హత్య చేయుంచారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నిర్వహణలో రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదు. సెంట్రల్ ఫోర్సును తెచ్చి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతున్నాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రామవరంలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు. అనంతరం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు సంతాప సభలో పాల్గొన్నారు.
రెండు ప్రాంతాల్లోనూ ఆయన మీడియాతో మాట్లాడారు. అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారన్నారు. డీజీపీ పోలీస్ యూనిఫాం తీసేసి వైసీపీ కండువా వేసుకుంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన సంఘటనపై ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలుపై విలేకరులు ప్రశ్నించగా... ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
‘కొడాలి’ వ్యాఖ్యలపై తెలుగు మహిళ నిరసన
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15: తిరుపతి లోక్సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు మహిళలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయ ఆవరణలో నాని పోస్టర్కు చెప్పుల మాల వేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే... టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ గురువారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.