పెద్దిరెడ్డి ముఖం మాడిపోయింది: నక్కా ఆనందబాబు
ABN , First Publish Date - 2021-04-18T20:39:29+05:30 IST
తిరుపతిలో దొంగఓట్ల ప్రణాళికను తెలుగుదేశం పార్టీ బయటపెట్టడంతో మంత్రి పెద్దిరెడ్డి ముఖం మాడిపోయిందని..
అమరావతి: తిరుపతిలో దొంగఓట్ల ప్రణాళికను తెలుగుదేశం పార్టీ బయటపెట్టడంతో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం మాడిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తిరుపతి ఉపఎన్నిక ఉందని విమర్శించారు. తండ్రి పేరు, భర్త పేరు చెప్పలేనివారు భక్తులా? అని ప్రశ్నించారు. గెలుపు కోసం దొంగ ఓటర్లను నమ్ముకున్నవారు.. భవిష్యత్లో ఎంతకైనా తెగిస్తారని అన్నారు. సీఈసీ తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలని నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు.