రాయలసీమకు ఏదైనా చేయాలనే తపన ఉంది: మాజీ మంత్రి
ABN , First Publish Date - 2021-10-03T01:29:38+05:30 IST
రాయలసీమ భవిష్యత్తు, రాయలసీమ కోసం ఏదైనా చేయాలనే తపన తనలో ఉందని మాజీ మంత్రి మైసూరారెడ్డి అన్నారు.
అమరావతి: రాయలసీమ భవిష్యత్తు, రాయలసీమ కోసం ఏదైనా చేయాలనే తపన తనలో ఉందని మాజీ మంత్రి మైసూరారెడ్డి అన్నారు. అది చేసినప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుందనేది ఆలోచన తనలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ ఊహించారని చెప్పారు. కానీ, రైతులు, ప్రజలు ఉహించినట్లు ఏమి జరగలేదన్నారు. నీటి విషయంలో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. నీటి హక్కు పై కూడా జగన్ ప్రభుత్వం ఏమి సాధించలేక పోయిందని చెప్పారు. సంక్షేమ పథకాలతో అభివృద్ధి జరగదని అభివృద్ధి పనులు కూడా ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి, నిర్లిప్తత అనేది ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తుందని మైసూరారెడ్డి అన్నారు.