ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా
ABN , First Publish Date - 2021-02-01T09:43:35+05:30 IST
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శనివారం జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోవడంతో కొవిడ్-19 వైరస్ సోకినట్టు తేలింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శనివారం జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోవడంతో కొవిడ్-19 వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వైద్యం కోసం ఆయన హైదరాబాద్కు వెళ్లారు. రెండు రోజుల క్రితం వేలాది మందికి ఇళ్ల స్ధలాల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇదే సభలో హోంమంత్రి సుచరిత, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.