సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-29T23:35:41+05:30 IST

సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు.

సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. వరి విత్తనాలు బదులు.. గంజాయి విత్తనాలు అమ్మాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళ్ళు మెక్కినందుకే సిద్దిపేట కలెక్టర్ డ్యూటీలో ఉన్నాడన్నారు. పండించిన ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?, తెలంగాణ బ్రాండ్‌తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. గంగుల కొంటానంటే.. హరీష్, జగదీష్ రెడ్డిలు కొనమంటున్నారు, ఎవరి మాటలు నమ్మాలన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 20 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్‌కు కేంద్రం బోనస్ ఇస్తోందన్నారు. 

Updated Date - 2021-10-29T23:35:41+05:30 IST