నువ్వు ఏమైనా పోటుగాడివా..
ABN , First Publish Date - 2021-07-09T02:08:04+05:30 IST
తన బాధను చెప్పుకున్న రైతుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో
పశ్చిమ గోదావరి: తన బాధను చెప్పుకున్న రైతుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. " నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో రైతుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మండిపడ్డారు. జిల్లాలోని ఇరగవరం మండలంలోని అర్జునపాలెం గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యరక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. మూడు నెలలుగా తనకు ధాన్యం డబ్బులు పడలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావును ఓ రైతు అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే, ఆ రైతును ఉద్దేశించి "నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న రైతులు విస్తూపోయారు.