వ్యవసాయ అధికారులపై ఎమ్మెల్యే కాపు ఫైర్
ABN , First Publish Date - 2021-11-27T22:32:50+05:30 IST
జిల్లాలోని వ్యవసాయ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్
అనంతపురం: జిల్లాలోని వ్యవసాయ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడతూ అధికారులు ఎవరూ కూడా పంటల ఈ- క్రాపింగ్ చేయడం లేదన్నారు. ఈ- క్రాపింగ్లో ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదన్నారు. పంటలు సాగుచేసిన విస్తీర్ణం కూడా సరిగా నమోదు చేయడం లేదని రాంచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.