ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2021-06-12T00:30:19+05:30 IST
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆల్ఇండియా పరీక్షలకు
విజయవాడ: ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆల్ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేదు అన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని తప్పుబట్టారు. ఒక తండ్రిగా తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తానని తెలిపారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదన్నారు. పరీక్షలు రద్దయ్యాయని కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. దీనిపై టాస్క్ఫోర్స్, విజిలెన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.